గిరిజన బిడ్డలపై మీకు ఎందుకింత కోపం?.. వీడియో పోస్ట్ చేస్తూ ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- మంచిర్యాల జిల్లాలో ఘటన
- గిరిజనులను గుడిసెల నుంచి తరలించిన పోలీసులు
- తిరస్కరించిన గిరిజన మహిళను ఈడ్చేసిన పోలీసులు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పోడు సాగు చేస్తున్న గిరిజనులు అక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరు పోడు భూములను ఆక్రమించారంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులను వారి గుడిసెల నుంచి బలవంతంగా తరలించే యత్నం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓ మహిళ తన గుడిసె నుంచి వెళ్లిపోయేందుకు నిరాకరించగా... ఆమెను మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజన మహిళ దుస్తులు ఊడిపోతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.