శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు?
- షిండే శిబిరంలో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు
- వారిలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు
- మిగిలిన ఏడుగురు ఇండిపెండెంట్లు
- గవర్నర్ ముందు బల ప్రదర్శనకు సిద్ధమన్న షిండే
ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడింట రెండొంతుల కంటే అధికంగా ఎమ్మెల్యేలను కలిగిన తమ శిబిరమే అసలైన శివసేన అని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ముందు బల ప్రదర్శనకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన తెలిపారు. నిన్నటిదాకా 38 మంది ఎమ్మెల్యేలే తన వెంట ఉన్నారన్న షిండే... గురువారం ఉదయం మరో నలుగురు ఎమ్మెల్యేలు తన శిబిరంలో చేరినట్లు వెల్లడించారు.