సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
- 3 రోజులుగా ఢిల్లీలోనే కిరణ్ కుమార్ రెడ్డి
- 45 నిమిషాల పాటు జరిగిన భేటీ
- భేటీలో చర్చకు వచ్చిన అంశాలు వెల్లడి కాని వైనం
- సోనియాతో భేటీ తర్వాత హైదరాబాద్కు బయలుదేరిన నల్లారి
ఢిల్లీకి వెళ్లిన రోజు వ్యక్తిగత పనుల నిమిత్తమే ఇక్కడికి వచ్చానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి... ఆ తర్వాత అసలు మీడియాకే కనిపించలేదు. తాజాగా సోనియాతో భేటీ అయిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు. ఈ భేటీలో సోనియా, కిరణ్ కుమార్ రెడ్డిలు దాదాపుగా 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.