సెబీకి తొలి లేడీ బాస్గా మాధబి పూరీ బుచ్
- సోమవారంతో ముగిసిన అజయ్ త్యాగి పదవీకాలం
- మాధబిని నియమిస్తూ కేంద్రం నిర్ణయం
- మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న లేడీ బాస్
సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధబిని సెబీ చైర్ పర్సన్గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మాధబి పూరీ బుచ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐలో కెరీర్ ప్రారంభించిన ఆమె.. రెండు దశాబ్దాల పాటు అదే బ్యాంకులో వివిద హోదాల్లో పనిచేశారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్కు ఎండీగానే కాకుండా సీఈఓగానూ వ్యవహరించారు.