ఈరోజు అధికారులు నా ఆఫీసుపై దాడి చేశారు.. రేపు కూల్చేస్తారు: కంగనా రనౌత్
- ముంబైలోని కంగన ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు
- తన ప్రాపర్టీకి అన్ని అనుమతులు ఉన్నాయన్న కంగన
- నోటీసు కూడా ఇవ్వకుండానే కూల్చేస్తారని వ్యాఖ్య
'నా ఆఫీసులోకి బీఎంసీ అధికారులు బలవంతంగా చొరబడ్డారు. అంతా కొలిచి చూశారు. నా ఆఫీసు పొరుగున ఉన్న వారిని కూడా టార్చర్ పెట్టారు. ఆ మేడమ్ చేసిన పనికి మీరంతా అనుభవిస్తారని వారిని బెదిరించారు' అని కంగన ట్వీట్ చేసింది.
తన వద్ద అన్ని పేపర్లు ఉన్నాయని, బీఎంసీ అనుమతులు కూడా ఉన్నాయని... తన ప్రాపర్టీలో ఒక్క ఇల్లీగల్ విషయం కూడా లేదని కంగన తెలిపింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, స్ట్రక్చర్ ప్లాన్ కూడా తీసుకురాకుండా అధికారులు ఈరోజు తన కార్యాలయానికి వచ్చారని చెప్పింది. రేపు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఆఫీసును కూల్చేస్తారని మండిపడింది.