సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Anu Emmanuel entering digital world
*  తెలుగులో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించినప్పటికీ, మలయాళ భామ అనూ ఇమ్మానుయేల్ కి టాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదు. ఆమె నటించిన ఆయా సినిమాలు అపజయాల పాలుకావడంతో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిన్నది వెబ్ సీరీస్ లలో కూడా నటించాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ప్రాజక్టులు చర్చల దశలో వున్నట్టు తెలుస్తోంది.
*  ప్రముఖ నటుడు విక్రం తన 60వ చిత్రాన్ని 'పేట' ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. విశేషం ఏమిటంటే, ఇందులో విక్రం తనయుడు ధృవ్ కూడా నటిస్తాడట. ధృవ్ గతేడాది 'ఆదిత్య వర్మ' (అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు.  
*  శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. నూతన దర్శకుడు శ్రీరాం రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, శర్వానంద్ నటించిన 'శ్రీకారం' చిత్రం విడుదలకు సిద్ధం కాగా, మరోపక్క అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' చిత్రాన్ని చేస్తున్నాడు.  
Go Back to Shorts
Anu Emmanuel
Pawan Kalyan
Vikram
Sharwanand

More Telugu News