Nara Lokesh: 'రౌడీ రాజ్యంలో రక్షణ కరవైంది' అంటూ వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fires on ycp leaders
  • ఫ్యాక్షన్ పోకడలను వైఎస్ జగన్ గారు వదులుకోవడం లేదు
  • శాంతి, భద్రతలను కాపాడాల్సిన వారే విఘాతం కలిగిస్తున్నారు
  • మంత్రాలయం నియోజకవర్గం తిప్పలదొడ్డి గ్రామంలో దాడి
  • టీడీపీ కార్యకర్తలపై వైకాపా రౌడీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'రౌడీ రాజ్యంలో రక్షణ కరవైంది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఫ్యాక్షన్ పోకడలను వైఎస్ జగన్ గారు వదులుకోవడం లేదు. శాంతి, భద్రతలను కాపాడాల్సిన వారే విఘాతం కలిగిస్తున్నారు' అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు.

'మంత్రాలయం నియోజకవర్గం తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైకాపా రౌడీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కక్ష సాధింపు రాజకీయం ద్వారా సాధించేది ఏమీ ఉండదు అనే విషయం జగన్ గారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది' అంటూ సలహా ఇచ్చారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News