శ్రీశైలానికి పూర్తిగా నిలిచిన వరద... 400 టీఎంసీలు సముద్రంలోకి!
- పదేళ్ల తరువాత భారీ వరద
- మూడు వారాల్లోనే నిండిపోయిన కృష్ణా జలాశయాలు
- నిన్నటితో ఆగిన వరద ప్రవాహం
ఇక, వర్షాలు తగ్గడంతో ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తిగా నిలిచిపోయింది. జూరాల నుంచి 3 రోజుల క్రితమే నీటిని నిలిపివేయగా, సుంకేసుల నుంచి విడుదల చేస్తున్న నీటిని నిన్న ఆపివేశారు. దీంతో శ్రీశైలానికి ఇన్ ఫ్లో ఆగిపోయింది. ఈ నెల 1 నుంచి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం మొదలుకాగా, 12న గరిష్ఠంగా 8.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చింది. మొత్తం మీద 25 రోజుల్లో 785 టీఎంసీల నీరు రాగా, అందులో 202 టీఎంసీల నీరు ప్రస్తుతం సాగర్ లో నిల్వ ఉంది. మిగతా నీటిలో కొంతమొత్తం పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లో ఉంది. ఇక ప్రస్తుతం జలాశయాల నుంచి వివిధ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు.