అణ్వాయుధాల టీమ్ ను సమావేశపరిచిన పాకిస్థాన్!
- ఇండియా, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం
- నేషనల్ కమాండ్ అథారిటీతో ఇమ్రాన్ సమావేశం
- అణు బాంబులు వేసేంత ధైర్యం చేయలేదంటున్న నిపుణులు
కాగా, పాకిస్థాన్ అణు బాంబులతో దాడి చేస్తుందని భావించాల్సిన అవసరం లేదని మాజీ దౌత్యాధికారి కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశానికి పిలవడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమే కావచ్చని, తాము కూడా ఏదైనా చేయగలమన్న సంకేతాలు ఇచ్చేందుకే ఇమ్రాన్ ఈ పని చేసుండవచ్చని ఆయన అన్నారు. పాకిస్థాన్ ఒక్క బాంబు ఇండియాపై వేస్తే, 20 బాంబులు వచ్చి పాక్ పై పడతాయని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.