- రాజా రవీంద్ర తండ్రి జయప్రకాష్ రాజ్ (70) మృతి
- కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయప్రకాష్ రాజు
- పలువురు సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు రాజా రవీంద్ర తండ్రి జయప్రకాష్ రాజ్ (70) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు.
బ్రెయిన్ హెమరేజ్ కారణంగా
జయప్రకాష్ రాజ్ మృతి చెందినట్టు సమాచారం. కాగా, జయప్రకాష్ రాజు మృతిపై సినీ ప్రముఖులు పలువురు తమ సంతాపం వ్యక్తం చేశారు. రాజా రవీంద్ర కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు.