బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని ఆకృత్యాలు.. మహిళపై సామూహిక అత్యాచారం
- ప్రభుత్వం మారినా ఆగని దాడులు, ఆకృత్యాలు
- దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం
- నిందితులను అరెస్టు చేయకపోవడంపై హిందూ సంఘాల ఆగ్రహం
స్పృహ కోల్పోయిన మహిళను నిందితులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఆ మహిళను గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తనపై రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వారు తనను తీవ్రంగా హింసించి గాయపరిచినట్లు తెలిపింది. అయితే పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. దీంతో స్థానికులు, హిందూ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.