ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్గా రాకేశ్ అగర్వాల్
- 2028 ఆగస్టు 31 వరకు పదవిలో కొనసాగనున్న రాకేశ్ అగర్వాల్
- గతంలో ఎన్ఐఏ స్పెషల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన రాకేశ్ అగర్వాల్
- రాకేశ్ అగర్వాల్ 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నియామకాల కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏసీసీ) ఈ నియామకాన్ని ఆమోదించింది. రాకేశ్ అగర్వాల్కు ఎన్ఐఏతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తన మూడు దశాబ్దాల పరిపాలన అనుభవంలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వర్తించారు. సంక్లిష్టమైన ఘటనల దర్యాప్తులను నిర్వహించడంలో ఆయనకు ఉన్న అనుభవమే ఈ నియామకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.