Nara Lokesh: ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం.. మా కుటుంబానికి మీరు కొండంత బలం: మంత్రి లోకేశ్
- ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామన్న లోకేశ్
- కూటమి ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమన్న మంత్రి
- చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదని వ్యాఖ్య... రెడ్ బుక్ ప్రస్తావన
- ఏపీని స్పీడ్కు బ్రాండ్ అంబాసిడర్గా మారుస్తామన్న లోకేశ్
- స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్న మంత్రి
- విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందన్న మంత్రి
- డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్
ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్ వెల్ సెంటర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ హరిహరపీఠం వేదపండితులు మంత్రి లోకేశ్ కు వేదాశీర్వచనాలు అందించారు.
అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ.... ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. రెండేళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మరో రెండేళ్లు స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేశాను. ఈ దేశంలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ, ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఆరుగురు పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘనస్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు .
ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
అమెరికాలో ఉన్నానా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అనే అనుమానం వచ్చింది. మీ ఉత్సాహం, జోష్ చూస్తుంటే.. నా యువగళం పాదయాత్ర రోజులు గుర్తుకువస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. నడవనివ్వలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మన వాళ్లు తొడగొట్టి, తగ్గేదేలేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో, అదే విధంగా ఈ రోజు నాకు అంత ఘనస్వాగతం పలికారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేశ్ తీసుకుంటాడు. చంద్రబాబు గారిని 53 రోజులు పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. డల్లాస్ లో ఏకంగా మూడు కార్యక్రమాలు నిర్వహించారు. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. అమెరికాలో, హైదరాబాద్ లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు 45వేల మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారు. ధైర్యం ఇచ్చారు. ఈ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవడం వల్లే.
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనల్ని మదరాసీలు అనేవారు. మదరాసీలు కాదు.. తెలుగువాళ్లం ఉన్నామని దేశానికి చాటిచెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్. అభివృద్ధి చేసి ఎన్నికల్లో గెలవవచ్చని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే.. కంప్యూటర్లు అన్నం పెడతాయా అని ఆనాటి ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేశారు. ఇప్పుడు మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. కంప్యూటర్ అన్నం పెడుతోందా అని. హైదరాబాద్ కు పెద్దఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువస్తే విమర్శించారు. మీరొక్కసారి హైటెక్ సిటీకి వెళితే.. గుర్తుపట్టలేని పరిస్థితి.
చంద్రబాబు దార్శనిక నాయకుడు
చంద్రబాబు ఐటీని పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకు హైదరాబాద్ పోటీ ఇస్తోంది. చంద్రబాబు వయసు 75 ఏళ్లు. 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారు. ఆయన స్పీడ్ ను ఇంకా అందుకోలేకపోతున్నా. ఏదో ఒకరోజు ఆయన స్పీడ్ కు దరిదాపుల్లోకి వస్తానని భావిస్తున్నా. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ. ఆయన ముందుచూపు ఉన్న నాయకుడు. తెలుగుజాతికే అది ఒక అదృష్టం. ఏ దేశానికి వెళ్లినా, ఏ కంపెనీకి వెళ్లినా సాదర స్వాగతం పలుకుతున్నారంటే కారణం.. మన నాయకుడు చంద్రబాబు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు శాశ్వతం కాదు.. కార్యకర్తలే టీడీపీకి బలం. అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండా చూసినా మనకు ఎక్కడలేని ఎమోషన్.
వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు
కార్యకర్తల త్యాగాలను మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. మెడపై కత్తిపెట్టినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. రక్తం కారుతున్నా చివరి ఓటు వేసే వరకు బూత్ లో అండగా నిలబడిన మంజుల రెడ్డికే మీ లోకేశ్ అండ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. జై తెలుగుదేశం అని అన్నందుకు విజయవాడలో గాంధీ గారు కంటిచూపు పోగొట్టుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో మీకు తెలుసు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేశారు. వై నాట్ 175 అన్నారు.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. చంద్రబాబు, పవనన్న ఫొటోలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే వారితో ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధం.. సిద్ధం.. అని బయలుదేరారు. ప్రజలు ఏకంగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు.
ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది.. వైసీపీ 11 ఆలౌట్ అయింది
అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అని అంటారు. కానీ, మీరు ఎంఆర్ఐలు. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ ఊరివైపు ఉంటుంది. ఊరి ప్రజలకు అండగా నిలవాలని ఎప్పుడూ ఆలోచిస్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. సొంత రాష్ట్రంపై ప్రేమ ఉంది కాబట్టే.. ఎన్నికలకు ఆరు నెలలు, ఏడాది ముందు వచ్చి మీరు ఏ పదవీ, డబ్బు ఆశించకుండా మాకు అండగా నిలిచారు. అందుకే ఎప్పుడూ లేనివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచి రికార్డ్ లు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డ్ లు కూడా తిరిగి రాస్తాం. 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా మీరు మమ్మల్ని గెలిపించారు. అందుకే కూటమి సూపర్ హిట్ అయ్యింది.. వైసీపీ 11 ఆలౌట్ అయింది.
స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది
దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ లు ఉన్నాయి. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు నాయకత్వం, మరో వైపు నాకు అన్న సమానమైన పవనన్న నాయకత్వంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. 2019 నుంచి 2024 వరకు మేం ఏపీ నుంచి వచ్చాం అని చెప్పుకునేందుకు సిగ్గుపడే వాళ్లం. ఈ రోజు అన్ని రంగాల్లో ఏపీ స్పీడ్ గా ముందుకు వెళ్తోంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ హబ్ గా చేశాం, కర్నూలులో పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం, అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువస్తున్నాం. చిత్తూరు, కడపకు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నెల్లూరు జిల్లాకు డైవర్సిఫైడ్ మాన్యుఫ్యాక్చరింగ్, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. ప్రకాశంను సీబీజీ హబ్ గా తయారుచేస్తున్నాం. కృష్ణా, గుంటూరులో రాజధానితో పాటు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకువస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. రిఫైనరీలు, అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ తో పాటు ఆర్సెల్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు గంగాధర నెల్లూరులో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశాను. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. మేం తిరగని దేశాలు లేవు. గత 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
జాబ్ క్రియేటర్స్ గా తయారు కావాలి
ఇక్కడ ఉన్న అందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చదువుకుని మంచి ఉద్యోగాల కోసం ఇంత దూరం వచ్చాం. ఒక్కో కుటుంబానికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు. 2019లో నేను మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయాను. కానీ అధైర్యపడలేదు. కసితో పనిచేసి 91వేల మెజార్టీతో విజయం సాధించాను. చిన్న ఎదురుదెబ్బ తగిలిందని బాధపడటం, ఆత్మహత్యలకు పాల్పడటం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. అద్భుతంగా పెంచారు. వారి గురించి కూడా ఆలోచించాలి. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్స్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా మనం తయారుకావాల్సిన అవసరం ఉంది.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదు
రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు. నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను. మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. నా తల్లి బాధ, ఆవేదనను చూసిన వాడిని. మా అమ్మ ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. వారి నాన్న గారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి. కానీ ఒక్క పోస్టింగ్ కానీ, కాంట్రాక్ట్ లో కానీ ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వారు అవమానించారని మనం అవమానించకూడదు. స్త్రీలను గౌరవించాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వేమూరు రవికుమార్, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం, టెక్సాస్ లోని గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్, డల్లాస్ టీడీపీ నాయకులతో పాటు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.







అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి లోకేశ్ ప్రసంగిస్తూ.... ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. రెండేళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మరో రెండేళ్లు స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేశాను. ఈ దేశంలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ, ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఆరుగురు పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డల్లాస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘనస్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు .
ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
అమెరికాలో ఉన్నానా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అనే అనుమానం వచ్చింది. మీ ఉత్సాహం, జోష్ చూస్తుంటే.. నా యువగళం పాదయాత్ర రోజులు గుర్తుకువస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు. నడవనివ్వలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మన వాళ్లు తొడగొట్టి, తగ్గేదేలేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో, అదే విధంగా ఈ రోజు నాకు అంత ఘనస్వాగతం పలికారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేశ్ తీసుకుంటాడు. చంద్రబాబు గారిని 53 రోజులు పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. డల్లాస్ లో ఏకంగా మూడు కార్యక్రమాలు నిర్వహించారు. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. అమెరికాలో, హైదరాబాద్ లోని స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి సుమారు 45వేల మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారు. ధైర్యం ఇచ్చారు. ఈ వేదికపై నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరు అండగా నిలవడం వల్లే.
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు
ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. గతంలో మనల్ని మదరాసీలు అనేవారు. మదరాసీలు కాదు.. తెలుగువాళ్లం ఉన్నామని దేశానికి చాటిచెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్. అభివృద్ధి చేసి ఎన్నికల్లో గెలవవచ్చని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే.. కంప్యూటర్లు అన్నం పెడతాయా అని ఆనాటి ప్రతిపక్ష నేతలు ఎగతాళి చేశారు. ఇప్పుడు మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. కంప్యూటర్ అన్నం పెడుతోందా అని. హైదరాబాద్ కు పెద్దఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువస్తే విమర్శించారు. మీరొక్కసారి హైటెక్ సిటీకి వెళితే.. గుర్తుపట్టలేని పరిస్థితి.
చంద్రబాబు దార్శనిక నాయకుడు
చంద్రబాబు ఐటీని పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకు హైదరాబాద్ పోటీ ఇస్తోంది. చంద్రబాబు వయసు 75 ఏళ్లు. 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారు. ఆయన స్పీడ్ ను ఇంకా అందుకోలేకపోతున్నా. ఏదో ఒకరోజు ఆయన స్పీడ్ కు దరిదాపుల్లోకి వస్తానని భావిస్తున్నా. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ. ఆయన ముందుచూపు ఉన్న నాయకుడు. తెలుగుజాతికే అది ఒక అదృష్టం. ఏ దేశానికి వెళ్లినా, ఏ కంపెనీకి వెళ్లినా సాదర స్వాగతం పలుకుతున్నారంటే కారణం.. మన నాయకుడు చంద్రబాబు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు శాశ్వతం కాదు.. కార్యకర్తలే టీడీపీకి బలం. అధికారంతో సంబంధం లేదు. అన్నగారిని చూసినా, ఆ పసుపు జెండా చూసినా మనకు ఎక్కడలేని ఎమోషన్.
వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు
కార్యకర్తల త్యాగాలను మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. మెడపై కత్తిపెట్టినా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. రక్తం కారుతున్నా చివరి ఓటు వేసే వరకు బూత్ లో అండగా నిలబడిన మంజుల రెడ్డికే మీ లోకేశ్ అండ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. జై తెలుగుదేశం అని అన్నందుకు విజయవాడలో గాంధీ గారు కంటిచూపు పోగొట్టుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో మీకు తెలుసు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేశారు. వై నాట్ 175 అన్నారు.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. చంద్రబాబు, పవనన్న ఫొటోలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే వారితో ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధం.. సిద్ధం.. అని బయలుదేరారు. ప్రజలు ఏకంగా ఆ పార్టీని భూస్థాపితం చేశారు.
ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యింది.. వైసీపీ 11 ఆలౌట్ అయింది
అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అని అంటారు. కానీ, మీరు ఎంఆర్ఐలు. మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాకు వచ్చి దశాబ్దాలు గడిచినా మీ మనసు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ ఊరివైపు ఉంటుంది. ఊరి ప్రజలకు అండగా నిలవాలని ఎప్పుడూ ఆలోచిస్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. సొంత రాష్ట్రంపై ప్రేమ ఉంది కాబట్టే.. ఎన్నికలకు ఆరు నెలలు, ఏడాది ముందు వచ్చి మీరు ఏ పదవీ, డబ్బు ఆశించకుండా మాకు అండగా నిలిచారు. అందుకే ఎప్పుడూ లేనివిధంగా 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుంది. 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచి రికార్డ్ లు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డ్ లు కూడా తిరిగి రాస్తాం. 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా మీరు మమ్మల్ని గెలిపించారు. అందుకే కూటమి సూపర్ హిట్ అయ్యింది.. వైసీపీ 11 ఆలౌట్ అయింది.
స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది
దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ లు ఉన్నాయి. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు నాయకత్వం, మరో వైపు నాకు అన్న సమానమైన పవనన్న నాయకత్వంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు స్పీడ్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. 2019 నుంచి 2024 వరకు మేం ఏపీ నుంచి వచ్చాం అని చెప్పుకునేందుకు సిగ్గుపడే వాళ్లం. ఈ రోజు అన్ని రంగాల్లో ఏపీ స్పీడ్ గా ముందుకు వెళ్తోంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ హబ్ గా చేశాం, కర్నూలులో పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం, అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకువస్తున్నాం. చిత్తూరు, కడపకు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నెల్లూరు జిల్లాకు డైవర్సిఫైడ్ మాన్యుఫ్యాక్చరింగ్, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. ప్రకాశంను సీబీజీ హబ్ గా తయారుచేస్తున్నాం. కృష్ణా, గుంటూరులో రాజధానితో పాటు క్వాంటమ్ కంప్యూటర్ తీసుకువస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వాను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. రిఫైనరీలు, అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ తో పాటు ఆర్సెల్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు గంగాధర నెల్లూరులో రోడ్డు పక్కన బజ్జీలు విక్రయించే మోహన అనే మహిళను కలిశాను. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. మేం తిరగని దేశాలు లేవు. గత 17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
జాబ్ క్రియేటర్స్ గా తయారు కావాలి
ఇక్కడ ఉన్న అందరూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చదువుకుని మంచి ఉద్యోగాల కోసం ఇంత దూరం వచ్చాం. ఒక్కో కుటుంబానికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు. 2019లో నేను మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయాను. కానీ అధైర్యపడలేదు. కసితో పనిచేసి 91వేల మెజార్టీతో విజయం సాధించాను. చిన్న ఎదురుదెబ్బ తగిలిందని బాధపడటం, ఆత్మహత్యలకు పాల్పడటం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. అద్భుతంగా పెంచారు. వారి గురించి కూడా ఆలోచించాలి. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్స్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్ గా మనం తయారుకావాల్సిన అవసరం ఉంది.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదు
రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు. నా తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టను. మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. నా తల్లి బాధ, ఆవేదనను చూసిన వాడిని. మా అమ్మ ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. వారి నాన్న గారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి. కానీ ఒక్క పోస్టింగ్ కానీ, కాంట్రాక్ట్ లో కానీ ఏనాడూ ఇన్ వాల్వ్ కాలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వారు అవమానించారని మనం అవమానించకూడదు. స్త్రీలను గౌరవించాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వేమూరు రవికుమార్, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరాం, టెక్సాస్ లోని గార్లాండ్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్, డల్లాస్ టీడీపీ నాయకులతో పాటు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.






