Advertisement

చర్చలతోనే పరిష్కారం..సీజేపీ ఉద్యమంపై యువరాజ్ సింగ్

Yuvraj Singh response on CJP movement Solution only through dialogue
  • విద్యార్థులకు శాంతి, భద్రత ముఖ్యమని ఉద్ఘాటన
  • చర్చల ద్వారానే సామరస్యపూర్వక పరిష్కారం సాధ్యమని పిలుపు
  • విద్యార్థుల శ్రేయస్సే దేశ భవిష్యత్తుకు పునాది అని వ్యాఖ్య 
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదంపై సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలపై టీమ్ ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించారు. విద్యార్థుల భద్రత, శాంతియుత వాతావరణం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన.. సమస్యలకు చర్చల ద్వారానే సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. “ప్రతి బిడ్డ, విద్యార్థి ప్రశాంతంగా విద్యను అభ్యసిస్తూ, సురక్షితంగా ఎదగాలి. విద్యార్థుల శ్రేయస్సే ఉజ్వల భారత భవిష్యత్తుకు పునాది. చర్చల ద్వారానే సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొందాం” అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని ఆయన తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.

నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరుతో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.                                
Advertisement
Yuvraj Singh
CJP movement
NEET paper leak controversy
Cockroach Janata Party
Dharmendra Pradhan
Student protests India

More Telugu News