Suglampalli village: ఇద్దరి ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ!
- పెద్దపల్లి జిల్లాలో ఘటన
- భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు
- పంచాయితీ నిర్వహించిన పెద్దమనుషులు
- అదుపుతప్పిన పరిస్థితి
- భార్య తరఫు బంధువులపై భర్త తరఫు వారు దాడి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దమనుషులు నిర్వహించిన పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కత్తుల దాడికి దారితీసింది.
సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన ఓ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామంలో పెద్దమనుషులు, బంధువుల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. అయితే, పంచాయితీ జరుగుతుండగానే పరిస్థితి అదుపు తప్పింది. భర్త తరపు బంధువులు ఆవేశంతో భార్య తరపు బంధువులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో గాండ్ల గణేశ్, మోటం మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో సుగ్లాంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ పెద్దదై, చివరికి ఇద్దరి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన ఓ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గ్రామంలో పెద్దమనుషులు, బంధువుల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. అయితే, పంచాయితీ జరుగుతుండగానే పరిస్థితి అదుపు తప్పింది. భర్త తరపు బంధువులు ఆవేశంతో భార్య తరపు బంధువులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో గాండ్ల గణేశ్, మోటం మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో సుగ్లాంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ పెద్దదై, చివరికి ఇద్దరి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.