Nayanthara: నయనతారపై రూ.5 కోట్లకు దావా వేసిన 'చంద్రముఖి' హక్కుదారు

Nayanthara Faces Lawsuit Over Chandramukhi Footage in Documentary
షార్ట్స్‌లో చూడండి
లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఓ కాపీరైట్ వివాదం ఎదుర్కొంటున్న ఈ డాక్యుమెంటరీపై తాజాగా మరో భారీ దావా నమోదైంది. సూపర్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి సంబంధించిన ఫుటేజీని తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌పై రూ. 5 కోట్ల దావా వేసింది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, డాక్యుమెంటరీ నిర్మాతలైన టార్క్ స్టూడియో ఎల్‌ఎల్‌పీకి, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ‘చంద్రముఖి’ సినిమా ఆడియో, వీడియో హక్కులు తమ వద్దే ఉన్నాయని, యూట్యూబ్ నుంచి సేకరించిన క్లిప్స్‌ను తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్ తన పిటిషన్‌లో ఆరోపించింది.

ఈ విషయంపై తాము మొదట లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ తెలిపింది. తమ సినిమా క్లిప్స్‌ను డాక్యుమెంటరీ నుంచి తక్షణమే తొలగించాలని, రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

గతేడాది నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ డాక్యుమెంటరీకి కాపీరైట్ చిక్కులు ఇదే మొదటిసారి కాదు. గతంలో నటుడు, నిర్మాత ధనుష్ కూడా తన నిర్మాణ సంస్థలో తీసిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా ఫుటేజీని అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ నయనతారపై రూ. 10 కోట్ల దావా వేశారు. ఇప్పుడు ‘చంద్రముఖి’ రూపంలో మరో వివాదం తెరపైకి రావడంతో ఈ డాక్యుమెంటరీ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
Nayanthara
Nayanthara Beyond the Fairytale
Chandramukhi
AP International
Netflix
Copyright issue
Kollywood
Dhanush
Nanum Rowdy Dhaan
Madras High Court

More Telugu News