పహల్గామ్ దాడి పాకిస్థానీయుల పనే.. ఎన్ఐఏ దర్యాప్తులో కీలక పురోగతి
- దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే సభ్యులుగా గుర్తింపు
- పహల్గామ్ లో వారికి ఆశ్రయమిచ్చిన ఇద్దరి అరెస్ట్
- నిందితులపై యూఏపీఏ సెక్షన్ 19 కింద కేసు నమోదు
వారిని విచారించగా.. పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ జాతీయులని, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారని ధ్రువీకరించారని చెప్పారు. దాడికి ముందు పర్వేజ్, బషీర్ ఉద్దేశపూర్వకంగానే హిల్ పార్క్లోని ఒక సీజనల్ గుడిసెలో (ధోక్) ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు. వీరు ఉగ్రవాదులకు ఆహారం, వసతితో పాటు ఇతర లాజిస్టికల్ సహకారం కూడా అందించారని తెలిపారు.
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్ 19 (ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించినందుకు శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.