Nara Brahmani: మహా కుంభమేళాలో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి: నారా బ్రాహ్మణి

Nara Brahmani opines on her experience attending to Maha Kumbhmela
షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, తనయుడు నారా దేవాన్ష్ నేడు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమం వద్ద షాహి స్నానఘట్టంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సంప్రదాయబద్ధంగా గంగాదేవికి పూజలు చేసి, హారతి ఇచ్చారు. దీనిపై నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

మహా కుంభమేళా-2025లో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి అని అభివర్ణించారు. ప్రయాగరాజ్ లో పవిత్ర స్నానం ఆచరించామని వెల్లడించారు. 

ఈ మహిమాన్విత గడ్డపైకి తరలివచ్చిన కోట్లాది మంది సామూహిక విశ్వాసాల నుంచి తాను అద్భుతమైన దివ్య శక్తిని అనుభూతి చెందానని నారా బ్రాహ్మణి వివరించారు. ఈ మేరకు తమ కుంభమేళా పర్యటన ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.
Go Back to Shorts
Nara Brahmani
Maha Kumbhmela
Nara Lokesh
TDP

More Telugu News