ఢిల్లీలో పాతికేళ్లుగా బీజేపీకి అధికారం దక్కలేదు... అందుకే ద్వేషం పెంచుకుంది: కేజ్రీవాల్
- ఢిల్లీని బీజేపీ నేర రాజధానిగా మారుస్తోందని ఆగ్రహం
- దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గ్యాంగ్ వార్లు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం
- మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారన్న కేజ్రీవాల్
రోహింగ్యా చొరబాటుదారుల పేరుతో పూర్వాంచలి, దళితుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆపార్ట్మెంట్లకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడానికి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు నిధులు మంజూరు చేస్తామన్నారు.