20 ఓవర్లలో 344 పరుగులతో జింబాబ్వే ప్రపంచ రికార్డ్
- నేపాల్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే
- గాంబియాపై నాలుగు వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసిన జింబాబ్వే
- 43 బంతుల్లో 133 పరుగులతో విరుచుకుపడిన కెప్టెన్ సికిందర్ రాజా
ఓపెనింగ్ బ్యాటర్ బ్రియాన్ బాన్నెట్ (50), మారుమణి (62) శుభారంభం ఇచ్చారు. 5.4 ఓవర్లలో 98 పరుగులు చేశారు. మారుమణి 19 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. కెప్టెన్ సికిందర్ రాజా 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్సులతో 133 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున అంతర్జాతీయ ట్వంటీ20లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సికిందర్ చరిత్ర సృష్టించాడు.