ఇజ్రాయెల్కు విమాన సర్వీసులు నిలిపివేసిన ఎయిరిండియా.. కారణం ఇదే!
- ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఇజ్రాయెల్కు విమానాలు బంద్
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే ఇందుకు కారణమన్న ఎయిరిండియా
- పరిస్థితులను సమీక్షించి విమానాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
అలాగే, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చింది. కాగా, ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్ పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.