సూపర్ సెంచరీ వెనుక రహస్యాన్ని బయటపెట్టిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ
- కెప్టెన్ బ్యాటే తన సెంచరీ సీక్రెట్ అన్న అభిషేక్
- ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడి బ్యాట్ తీసుకొని ఆడతానంటూ వెల్లడి
- భయం లేకుండా షాట్లు ఆడడంలో యువరాజ్, తన తండ్రి సాయం చేశారన్న శర్మ
అండర్-12 నుంచి గిల్తో తన స్నేహ బంధం మొదలైందని, అతడితో స్నేహ బంధం అందమైనదని అభిషేక్ వ్యాఖ్యానించాడు. అండర్-12 నుంచి కలిసి ఆడే వాళ్లమని, తాను టీమిండియాకు ఎంపికైనప్పుడు మొదటి ఫోన్ కాల్ శుభ్మాన్ గిల్ నుంచే వచ్చిందని వెల్లడించారు. జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చిన్న వయసు నుంచి గిల్ బ్యాట్తో ఆడేవాడినని, ఈ రోజు (శనివారం) కూడా ఆడానని, అందుకే అతడి బ్యాట్కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. ఇక ఐపీఎల్లో కూడా గిల్ బ్యాట్తో ఆడానని అభిషేక్ శర్మ ప్రస్తావించాడు.
ఇక తాను భయం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేయగలగడంలో భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్తో పాటు తన తండ్రి సహకారం ఉందని వెల్లడించారు. కాగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో డకౌట్ కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపించిందని అన్నాడు. అయితే ఒత్తిడిని నియంత్రించుకునే విషయంలో యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతోందని, అరంగేట్ర ఆటగాళ్లు భారత్ తరపున ఆడుతున్నప్పుడు పెద్దగా ఒత్తిడి కలగదని అన్నాడు.
కాగా హరారే వేదికగా జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండవ టీ20లో శుభమాన్ గిల్తో కలిసి ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసి 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. అయితే భారత్ 100 పరుగుల తేడాతో గెలిచేందుకు తను బాటలు వేశాడు.