కునుకు తీసిన స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ లేక ముందుకు కదలని ఎక్స్ప్రెస్ రైలు!
- మే 3న ఉత్తరప్రదేశ్లోని ఉడిమోర్ జంక్షన్ వద్ద ఘటన
- పాట్నా-కోటా రైలు వచ్చే సమయానికి నిద్రలోకి జారిన స్టేషన్ మాస్టర్
- సిగ్నల్ మారకపోవడంతో జంక్షన్ వద్దే అరగంటపాటు నిలిచిపోయిన రైలు
- స్టేషన్ మాస్టర్ తీరుపై ఉన్నతాధికారుల సీరియస్, చర్యలు తీసుకుంటామని ప్రకటన
కాగా, స్టేషన్ మాస్టర్ విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని తీవ్రంగా పరిగణించిన డివిజన్ రైల్వే అధికారులు ఆయన నుంచి వివరణ కోరారు. అనంతరం, తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ ఓ వార్తాసంస్థకు తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనతో పాటు డ్యూటీలో ఉన్న పాయింట్మెన్ ట్రాక్ తనిఖీలకు వెళ్లడంతో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నానని స్టేషన్ మాస్టర్ తెలిపాడని చెప్పారు.