రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు
- మాదిగ జాతిని ఎదగకుండా బొందపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
- సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం
- ముఖ్యమంత్రి ఏ పథకం మీదా దృష్టి సారించడం లేదని విమర్శ
సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు లేదు.. రైతుబంధు ఊసు లేదు... తులం బంగారం లేదు, రూ.2500 ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందన్నారు. పేరుకే ప్రజాపాలన... కానీ అదేమీ కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ పథకం మీదా దృష్టి సారించడం లేదన్నారు. ఏమైనా అంటే డబ్బులు లేవని అంటున్నారని... పైసల్ లేవంటే ఇక ముఖ్యమంత్రిగా ఎందుకని విమర్శించారు. ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదని తెలుసుకోవాలన్నారు.