బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న అశ్విన్
- తాజాగా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
- మళ్లీ అగ్రపీఠం అధిష్ఠించిన టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్
- ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లో 26 వికెట్లు తీసిన అశ్విన్
ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు అశ్విన్ కెరీర్ లో 100వ టెస్టు. ఈ మ్యాచ్ లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తమ్మీద ఈ ఐదు టెస్టుల సిరీస్ లో అశ్విన్ 26 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
ఇక, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా, హేజెల్ వుడ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా కగిసో రబాడా, ప్యాట్ కమిన్స్, నాథన్ లైయన్, రవీంద్ర జడేజా, ప్రభాత్ జయసూర్య, జేమ్స్ ఆండర్సన్, షహీన్ అఫ్రిది ఉన్నారు.