దూకుడు పెంచిన బీజేపీ.. చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర మంత్రి
- చంద్రబాబుతో భేటీ కానున్న గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
- ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్న నేతలు
- కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు
11 గంటలకు వీరి భేటీ ప్రారంభం కాబోతోంది. సమావేశం ముగిసిన అనంతరం షెకావత్ నేరుగా ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు నిన్న రాత్రి షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై వీరిద్దరూ చర్చించారు. బీజేపీ, జనసేనలకు టీడీపీ 8 ఎంపీ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిలో 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని సమాచారం. మరోవైపు, కాసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి బయల్దేరారు.