పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన పురందేశ్వరి
- పొత్తు ఉంటే పార్టీ పెద్దలే ప్రకటిస్తారన్న పురందేశ్వరి
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని వెల్లడి
- జాబితాను రెండు రోజుల్లో హైకమాండ్ కు పంపుతామన్న పురందేశ్వరి
ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని పురందేశ్వరి చెప్పారు. తాము మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని... తమ జాబితాను రెండు రోజుల్లో హైకమాండ్ కు పంపుతామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 వేల మంది వరకు అభ్యర్థులు వచ్చారని... వీరిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని చెప్పారు. తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని... త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు.