కోనాయిపల్లి ఆలయంలో సీఎం కేసీఆర్ పూజలు
- నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించిన సీఎం
- ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు
- ఆనవాయతీగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్
ఆయన వెంట మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు, అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్ ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి శేష వస్త్రాలతో పాటు, తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా, ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న ఉదయం గజ్వేల్ లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం.