పేదవారి గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్: బిత్తిరి సత్తి
- బిత్తిరి సత్తి వీడియోను షేర్ చేసిన బీఆర్ఎస్ పార్టీ
- వేలకోట్లు ఉన్న నాయకులు పార్టీ మారుతున్నారని విమర్శలు
- కానీ కేసీఆర్ మాత్రం డబ్బులు ఉన్న వారి గురించి ఆలోచించడం లేదన్న బిత్తిరి సత్తి
ఈ క్రమంలో బిత్తిరి సత్తి మరో వీడియోను విడుదల చేశారు. నాయకులు ఎన్నికల సమయంలో పార్టీలు మారుతున్నారని, వారి వద్ద వేలకోట్ల రూపాయలు ఉండటంతో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారని, కానీ కేసీఆర్ మాత్రం వేలకోట్ల ఆదాయం ఉన్నవారి గురించి ఆలోచించడం లేదని, అయిదువేళ్లు నోట్లోకి వెళ్తున్నాయా? లేదా? అనే పేదవారి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని చెప్పారు. దీనిని అందరూ గమనించాలన్నారు.