Saitej: 100 కోట్లు కొల్లగొట్టిన 'విరూపాక్ష' .. మెగా ఫ్యాన్సులో తగ్గిన టెన్షన్!

  • ఏప్రిల్ 21న విడుదలైన 'విరూపాక్ష'
  • నిన్నటితో 27 రోజులు పూర్తి 
  • సాయితేజ్ కెరియర్లో తొలి 100 కోట్ల సినిమా 
  • కథాకథనాలు, ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్  
Virupaksha Movie Update

సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష' ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా, ఒక నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. కథానాయికగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ కనిపించింది. 

ఈ సినిమా 100 కోట్లను రాబట్టినట్టుగా ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితం అధికారిక పోస్టర్ ను వదిలింది. నిన్నటితో ఈ సినిమా విడుదలై 27 రోజులు పూర్తయింది. ఈ సినిమా 100 కోట్ల మార్క్ కి చేరువలో ఉండగా, ఈ నెల 21వ తేదీ నుంచి ఓటీటీలో రానున్నట్టుగా ప్రకటన వచ్చేసింది. దాంతో సాయితేజ్ కి 100 కోట్ల సినిమా రికార్డు దక్కకుండా పోతుందా ఏంటీ అనే టెన్షన్లో అభిమానులు ఉండిపోయారు. 

కానీ మొత్తానికి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది. సాయితేజ్ ఖాతాలోను చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోయింది. దర్శకుడు కథను ట్రాక్ ఎక్కించడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవడం .. చెప్పదలచుకున్న విషయాన్ని నీట్ గా .. ఇంట్రెస్టింగ్ గా చెప్పడం, కెమెరా పనితనం .. ఆజానీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. 

More Telugu News