Mahesh Babu: ఆ టైటిల్ పట్ల మొగ్గుచూపుతున్న మహేశ్ బాబు!

  • త్రివిక్రమ్ తో మహేశ్ మూడో సినిమా
  • ప్రధాన కథానాయికగా పూజ హెగ్డే 
  • మరో కథానాయికగా శ్రీలీల
  • సంగీతాన్ని అందిస్తున్న తమన్ 
  • వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల 
Mahesh and Trivikram movie update

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ యాక్షన్ తో పాటు బలమైన ఎమోషన్స్ తో నడిచే కథ ఇది. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. రెండో కథానాయికగా శ్రీలీల సందడి చేయనుంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. కాకపోతే త్రివిక్రమ్ కి 'అ' అక్షరంతో టైటిల్ పెట్టడం సెంటిమెంట్. 'అ' అక్షరంతోనే కథకి దగ్గరగా ఉండే కొన్ని టైటిల్స్ ను పరిశీలించారు. 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ టైటిల్ పట్ల మహేశ్ బాబు మొగ్గుచూపుతున్నాడని అంటున్నారు. 

త్రివిక్రమ్ ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నాడని చెబుతున్నారు. మరి ఇదే టైటిల్ కి ఫిక్స్ అవుతారో .. మరో టైటిల్ కి వెళతారో చూడాలి. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న ఈ మూడో సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి.   

More Telugu News