Saitej: 'విరూపాక్ష' 5 రోజుల వసూళ్లు ఇవే!

  • ఈ నెల 21న విడుదలైన 'విరూపాక్ష'
  • నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమా 
  • 5 రోజుల్లో 55 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  • సాయితేజ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా 
Virupaksha Movie Update

సాయితేజ్ హీరోగా ఈ నెల 21వ తేదీన 'విరూపాక్ష' సినిమా థియేటర్లకు వచ్చింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. క్షుద్ర శక్తుల అధీనంలో ఉన్న ఒక గ్రామాన్ని రక్షించే యువకుడి కథనే ఈ సినిమా. 

మొదటి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 5 రోజులకు గాను ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. 

సాయితేజ్ కెరియర్ లో ఇంత వేగంగా 50 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమా ఇదేనని చెప్పాలి. 'చిత్రలహరి' తరువాత నుంచి వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరవుతున్న సాయితేజ్ కి, ఈ సినిమా ఊరటనిచ్చింది. అలాగే సంయుక్త మీనన్ కి కూడా కాస్త గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్ర ఇది. ఈ వారం థియేటర్లలో దిగుతున్న 'ఏజెంట్' .. 'పొన్నియిన్ సెల్వన్ 2' పోటీని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకూ నిలబడుతుందనేది చూడాలి. 
 

More Telugu News