Nara Lokesh: ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టండి: ఈనాటి లోకేశ్ పాదయాత్ర హైలైట్స్

  • చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 11వ రోజు కొనసాగిన యువగళం
  • బీడీ కార్మికులు, విద్యుత్ ఒప్పంద ఉద్యోగులకు భరోసా
  • మహిళలతో ముఖాముఖీ
  • ఎస్సీలకు లోకేశ్ అభయహస్తం
Lokesh padayatra details

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగించారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో యువగళం పాదయాత్రలో భాగంగా రోడ్డు పై సభ నిర్వహించారంటూ అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలు కేశవ, చరణ్, షబ్బీర్, అశోక్ బెయిల్ పై విడుదల అయ్యారు. 

చిత్తూరు టౌన్ క్యాంప్ సైట్ లో బెయిల్ పై విడుదలైన నలుగురు టీడీపీ కార్యకర్తలను లోకేశ్ కలిశారు. సైకో పాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నారు అంటూ వారిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు అన్ని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కొట్టేయడంతో పాటు అక్రమ కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తప్పిస్తాం అని హెచ్చరించారు.


పాదయాత్ర హైలైట్స్...

  • 11వ రోజు ఉదయం చిత్తూరు క్యాంప్ సైట్ లో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం
  • కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీలు దిగిన లోకేశ్
  • పాదయాత్రలో లోకేశ్ ను కలిసిన బీమా మిత్రలు
  • విజయవంతమయ్యేలా సేవలందించిన తమను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క కలంపోటుతో తొలగించిందని ఆవేదన వ్యక్తం చేసిన బీమా మిత్రలు
  • సంతపేటలో ఇటీవల మృతిచెందిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జహంగీర్ ఖాన్ కు లోకేశ్ నివాళులు
  • జహంగీర్ ఖాన్ కుటుంబానికి అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా
  • సంతపేట వద్ద లోకేశ్ ను కలిసిన బీడీ కార్మికులు
  • తమకు కనీస వేతనాలు అమలుచేయాలని, పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, పక్కా ఇళ్లు మంజూరుచేయాలని కోరిన బీడీకార్మికులు  
  • కోర్టు సమీపంలో లోకేశ్ ను కలిసిన న్యాయవాదులు. లోకేశ్ కు సంఘీభావంగా పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన న్యాయవాదులు
  • తమ కష్టాలను లోకేశ్ తో చెప్పుకున్న ఏపీఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగులు
  • పర్మినెంట్ చేస్తానని పాదయాత్రలో చెప్పిన జగన్ ఆ తర్వాత మోసం చేశాడన్న కాంట్రాక్టు ఉద్యోగులు
  • విద్యుత్ ఉద్యోగులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చి ముందుకు కదిలిన లోకేశ్

చిత్తూరులో మహిళలతో లోకేశ్ ముఖాముఖి

చిత్తూరు పట్టణంలో అమరరాజా ప్రాంగణంలో మహిళలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. "జగన్ సంపూర్ణ మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నాడు. నాలుగేళ్లైనా మద్య నిషేధం చేయకుండా... కల్తీ మద్యంతో  బినామీలతో వ్యాపారం చేస్తున్నాడు. 45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నాడు. ఉన్న పెన్షన్లు పీకేస్తున్నాడు. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రూ.15 వేలు ఇస్తానన్నారు. ఒక్కరికే పరిమితం చేసి రూ.13 వేలు ఇస్తున్నాడు. డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు పక్కదారి పట్టించాడు" అంటూ మండిపడ్డారు. 

అంతేకాదు, సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేనోడు సాధారణ మహిళలకు ఏం న్యాయం చేస్తాడని లోకేశ్ విమర్శించారు. "వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కోరిన సునీతను కూడా తరిమేశారు. మానభంగం చేస్తే ఏ పోలీసూ రాడు... కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఎంతమందిపై కేసులు పెడతారు... మహిళలంతా గొంతెత్తితే జగన్ పారిపోతాడు" అని లోకేశ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పటిష్టమైన చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. 

చిత్తూరులో ఎస్సీలతో లోకేశ్ ముఖాముఖి

చిత్తూరు పట్టణంలో పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ఎస్సీలతో ముఖాముఖి సమావేశమయ్యారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 పథకాలను ఎందుకు రద్దు చేశారని వైసీపీ మంత్రి మేరుగ నాగార్జునను ప్రశ్నించారు. ఎస్సీల సంక్షేమానికి ఎవరేం చేశారో బహిరంగచర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు దారిమళ్లించింది నిజం కాదా? అని నిలదీశారు. 

జగన్ రెడ్డి రాజ్యంలో ఎస్సీ, ఎస్టీలు కూడా అట్రాసిటీ చట్టం బాధితులేనని అన్నారు. జగన్ రెడ్డి ఎట్రాసిటీ కేసుకు నేను కూడా బాధితుడినే అని లోకేశ్ వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడిచేసినపుడు అక్కడకు వచ్చి ఫోటోలు తీస్తున్న నాయక్ అనే సిఐని కార్యకర్తలు ప్రశ్నించినందుకు నాపైన, అశోక్ బాబుపైన కేసుపెట్టారు"  అని లోకేశ్ వెల్లడించారు. దళితులను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వ్యవహారాన్ని ప్రస్తావించారు. 

చంద్రబాబు దళితులకు పెద్ద పీట వేశారని లోకేశ్ వెల్లడించారు. "ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత చంద్రబాబుది. విదేశీవిద్య ద్వారా ప్రభుత్వమే డబ్బులిచ్చి విదేశాల్లో చదువుచెప్పించి దళితుల్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావించారు. దళిత పిల్లలకు కార్పొరేట్ విద్యనందించేలా బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ విధానాన్ని చంద్రబాబు అమలు చేశారు. దళితులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇన్నోవా కార్లు కూడా చంద్రబాబు అందించారు" అని తెలిపారు.


నారా లోకేశ్ పాదయాత్ర వివరాలు*
ఇప్పటివరకు నడిచిన దూరం: 139.8 కిలోమీటర్లు
11వరోజు (6-2-2023) నడిచిన దూరం: 9.2 కిలోమీటర్లు

లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర 12వ రోజు (7-02-2023) మంగళవారం షెడ్యూల్‌ వివరాలు

*చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం*

  • ఉదయం 8.00 నుంచి 3.00 గంటల వరకు – కొంగారెడ్డిపల్లి టీడీపీ జిల్లా కార్యాలయం పక్కనున్న క్యాంప్ సైట్ లో రిజర్వ్.
సాయంత్రం
  • 3.00 గంటలకు– చిత్తూరు జిల్లా టీడీపీ  కార్యాలయం పక్కన గల ఖాళీస్థలంలో బహిరంగ సభ.
        
  • 4.30 గంటలకు– టీడీపీ కార్యాలయం వద్ద  నుంచి పాదయాత్ర ప్రారంభం.
        
  • 5.15 గంటలకు– కొంగారెడ్డిపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
        
  • 7.30 గంటలకు – దిగువమాసపల్లి విడిది కేంద్రంలో బస.





More Telugu News