Nara Lokesh: పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర.. రెడ్డి సామాజికవర్గంతో భేటీ.. ఈనాటి షెడ్యూల్ ఇదిగో!

  • నాలుగో రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి పాదయాత్ర ప్రారంభం
  • 8.45 గంటలకు పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర
Nara Lokesh Yuva Galam Padayatra day 4 schedule

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నాటి పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై... పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం 8 గంటలకు పాదయాత్ర చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి ప్రారంభమయింది. 

యువగళం పాదయాత్ర 4వ రోజు షెడ్యూల్:

  • ఉదయం 8 గంటలకు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుండి పాదయాత్ర ప్రారంభం.
  • 8:45కి పలమనేరు నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశం.
  • 9:30కి వి.కోట మండలం కెంగుటం పంచాయతీ కోరకుంటలో రెడ్డి సామాజికవర్గంతో ముఖాముఖి.
  • 10:10కి వి.కోట మండలం పడిగల కుప్పం వద్ద మల్బరీ రైతులతో ముఖాముఖి.
  • 10:40కి వి.కోట మండలం గాంధారమాకులపల్లెలో వడ్డెర సామాజికవర్గం ప్రజలతో ముఖాముఖి.
  • 12:20కి వి.కోట మండలం జీఎంఆర్ కళ్యాణమండపంలో యువతతో సమావేశం.
  • మధ్యాహ్నం 02:05కి వి.కోట మండలం పీఎంఆర్ సత్రం వద్ద భోజన విరామం
  • 04:15కి వి.కోట మండలం ఆఘ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న స్థలంలో ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి.
  • 07:20కి వి.కోట మండలం కృష్ణపురం టోల్ గేట్ సమీపంలో రాత్రిపూట బస.

More Telugu News