పుష్ప వచ్చి ఏడాది.. ప్రత్యేక ఫొటో విడుదల చేసిన చిత్ర బృందం
- గతేడాది డిసెంబర్ 17న విడుదలైన చిత్రం
- భారీ విజయంతో రూ. 400 కోట్లు వసూలు
- ప్రస్తుతం రెండో పార్టు చిత్రీకరిస్తున్న సుకుమార్
హిందీలోనే వంద కోట్లు రావడం విశేషం. ప్రస్తుతం రెండో పార్టు కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిత్రం రెండో భాగం పుష్ప–ది రూల్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు దర్శకుడు సుకుమార్. తొలి పార్టు విడుదలైన ఏడాది అయిన సందర్భాన్ని చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రత్యేక ఫొటోను విడుదల చేసింది. పుష్ప ఇటీవల రష్యాలో విడుదలైంది. ఈ సందర్భంగా బన్నీ, రష్మిక, సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రష్యా పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.