ఇంతకుముందులా ఇప్పుడెవరూ కామెడీ పాత్రలు రాయడం లేదు: సునీల్
- సందడిగా శిరీష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ
- తన పాత్రను గురించి ప్రస్తావించిన సునీల్
- ఇదివరకటిలా భారీ కథలు రావడం లేదని వ్యాఖ్య
"గతంలో గీతా ఆర్ట్స్ లోని సినిమాలను లైన్లో నుంచుని టిక్కెట్టు కొని చూశాను. ఆ తరువాత గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేశాను. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులను పోషిస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కామెడీ పాత్రలను గతంలో మాదిరిగా ఎవరూ రాయడం లేదు. ఇప్పుడు ఉపకథలన్నీ కథలైపోయాయి. ఈ సందులో నుంచి వెళ్లి ఆ సందులోకి తిరిగితే సినిమా అయిపోయిందని అంటున్నారు" అని చెప్పాడు.
"భారీ కథలు .. ఆ కథలో భాగంగా కామెడీ ఎపిసోడ్స్ .. ఇప్పుడు ఉండటం లేదు. అందువలన ఇదివరకటిలా నేను కామెడీ వేషాలు వేయలేకపోతున్నాను. కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు రాకేష్ శశి పాత సునీల్ ను చూపించే ప్రయత్నం చేశాడు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే సినిమా ఇది. అల్లు శిరీష్ కి ఇంతకాలానికి సరైన సినిమా పడిందని నేను బలంగా చెప్పగలను" అంటూ ముగించాడు.