Ratan Tata: రతన్ టాటా, చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ లకు సేవారత్న అవార్డును అందించిన ఆరెస్సెస్

  • సామాజిక సేవకు గుర్తింపుగా సేవారత్న అవార్డులు
  • అవార్డు అందుకున్న వారిలో ఏపీకి చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్
  • కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రతన్ టాటా
Ratan Tata Awarded Sewa Ratna By RSS

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ఏపీకి చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ లకు సేవారత్న పురస్కారాలను ఆరెస్సెస్ అందజేసింది. సమాజానికి వారు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందించింది. మరో 24 మంది వ్యక్తులు, సంస్థలకు కూడా అవార్డులను అందజేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్ లెప్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్) చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. 

అయితే ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదని ప్రకటనలో ఆరెస్సెస్ తెలిపింది. తమ దాతృత్వంలో సమాజానికి నిస్వార్థంగా వెలకట్టలేని సేవలందించిన వారిని ఈ పురస్కారాలను అందిస్తున్నట్టు వెల్లడించింది.

More Telugu News