Rajinikanth: చెస్ బోర్డు ముందు తలైవా... చెన్నై ఒలింపియాడ్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్

  • నేటి నుంచి చెస్ ఒలింపియాడ్
  • చెన్నైలో ప్రారంభోత్సవం
  • మహాబలిపురంలో పోటీలు
  • చెస్ మేధావులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలన్న రజనీ
Rajinikath wishes all the very best for Chennai Olympiad participants

భారత్ లో మరో క్రీడోత్సవానికి తెరలేవనుంది. నేటి నుంచి తమిళనాడులో చెన్నై ఒలింపియాడ్ నిర్వహించనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం చెన్నైలో జరగనుండగా, పోటీలు మాత్రం మహాబలిపురంలో నిర్వహిస్తారు. 188 దేశాల నుంచి క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్నారు. 

ఈ నేపథ్యంలో, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ చెస్ ఒలింపియాడ్ పై స్పందించారు. ఇండోర్ గేమ్ అయిన చెస్ ఒలింపియాడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఈ చదరంగ క్రీడోత్సవంలో పాల్గొంటున్న చెస్ మేధావులందరూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నానని తెలిపారు. వారికి దేవుని ఆశీస్సులు ఉండాలని తలైవా ట్వీట్ చేశారు. ఈ మేరకు తాను చెస్ ఆడుతున్న ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ పోటీలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరుకానున్నారు. ఆగస్టు 10 వరకు ఈ పోటీలు జరుగుతాయి.

More Telugu News