Shiv Sena: శివ సైనికుల సహనం నశిస్తోంది.. వీధుల్లో అగ్గి రాజుకుంటుంది.. సంజయ్​ రౌత్​ హెచ్చరిక

  • శివ సైనికులు ఇప్పటివరకు ఓర్పుతో ఉన్నారన్న సంజయ్ 
  • వారే గనక బయటికొస్తే అగ్గి రాజుకుంటుందని హెచ్చరిక 
  • ఎన్నో త్యాగాలతో శివసేన నిర్మాణం జరిగిందని వెల్లడి 
  • ధనబలంతో ఎవరూ ధ్వంసం చేయలేరని వ్యాఖ్య 
If shiv sainiks came out the streets will be on fire says sanjay raut

శివసేన చాలా పెద్దదని, దానిని ఎవరూ హస్తగతం చేసుకోలేరని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలతో పార్టీ నిర్మాణం జరిగిందని.. దానిని ఎవరూ ధన బలంతో ధ్వంసం చేయలేరని పేర్కొన్నారు. శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు శివ సైనికులు ఓర్పుగా ఉన్నారని.. అయితే వారిలో సహనం నశిస్తోందని ప్రకటించారు. ఒకవేళ శివ సైనికులు గనుక బయటికి వస్తే వీధుల్లో అగ్గి రాజుకుంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

సభకు రండి.. ఎవరి బలమెంతో తేలుతుంది

శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యానని.. ఆ సమయంలో పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి తమకు ఫోన్ వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో విశ్వాస పరీక్షకు రావాలని.. అప్పుడు ఎవరు బలవంతులో తేలుతుందని సవాల్ చేశారు. కాగా.. ఏక్ నాథ్ షిండేతో కలిసి అసోంలోని గువాహటి క్యాంపులో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు శనివారం దాడి చేశారు.

More Telugu News