GVL Narasimha Rao: ఇది ఏపీ పట్ల మోదీ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ: జీవీఎల్

  • విజయసాయిని ఉద్దేశించి జీవీఎల్ ట్వీట్
  • ఏపీకి కేంద్రం సాయం చేస్తోందని వెల్లడి
  • 2014లో రూ.27 వేల కోట్లు ఇచ్చినట్టు వివరణ
  • 2020లో రూ.77 వేల కోట్లు అందించినట్టు స్పష్టీకరణ
GVL tweets about Center assistance to AP

వైసీపీ నేతలతో తన మాటల యుద్ధాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ఏపీకి మోదీ ప్రభుత్వం 2014లో రూ.27 వేల కోట్లు ఇచ్చిందని, 2020 నాటికి నిధులను రూ.77 వేల కోట్లకు పెంచిందని జీవీఎల్ వెల్లడించారు. 

అన్ని రాష్ట్రాల మాదిరే పన్నుల రూపంలో వచ్చినదానికంటే కేంద్ర సాయం కింద రెట్టింపు వచ్చిందని వివరించారు. దీన్ని విజయసాయిరెడ్డి కాదనగలరా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఇది ఏపీ పట్ల మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధ అంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఏపీకి కేంద్రం నుంచి అందిన పన్నుల వాటా, ఆర్థికసాయం వివరాలను కూడా పంచుకున్నారు.

More Telugu News