Rakesh Tikait: బెంగళూరులో రైతు నేత రాకేశ్ టికాయత్ పై ఇంకు చల్లిన వ్యక్తులు

  • బెంగళూరులో టికాయత్ కు చేదు అనుభవం
  • రణరంగంలా మారిన ప్రెస్ మీట్
  • కుర్చీలతో కొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన వ్యక్తులు
  • బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కయిందన్న టికాయత్
Ink thrown at Rakesh Tikait in Bengaluru

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ కు బెంగళూరులో ఊహించని అనుభవం ఎదురైంది. టికాయత్ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనగా, ఒక్కసారిగా దూసుకువచ్చిన కొంతమంది వ్యక్తులు ఆయనపై ఇంకు చల్లారు. అనంతరం ఆ ప్రెస్ మీట్ కాస్తా రణరంగంలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ, కుర్చీలతో కొట్టుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. 

కాగా, ఈ ఘటనపై టికాయత్ స్పందించారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులతో తనకు భద్రత ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయిన కొన్ని శక్తులే ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపణలు చేశారు.

More Telugu News