తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్పై జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం
- సీఎం, హైకోర్టు సీజే ఆదేశాలను అమలు చేయట్లేదు
- కీలక నిర్ణయాలన్నీ పెండింగ్లోనేనన్న జస్టిస్ ఎన్వీ రమణ
- ఈ అంశాన్ని పరిశీలిస్తామన్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఉదయం ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేలతో మొదలైన సదస్సులోనే జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. తన తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఢిల్లీకి పంపారు. సమావేశంలో తెలంగాణ సీఎస్ను ప్రస్తావిస్తూ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను నోట్ చేసుకున్నామని, వాటిపై పరిశీలన చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.