Tollywood: ముగిసిన టాలీవుడ్ విస్తృతస్థాయి సమావేశం

Tollywood wide range meeting concluded
షార్ట్స్‌లో చూడండి
చలనచిత్ర రంగ పరిస్థితులు, సినీ కార్మికుల సమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు ఇవాళ హైదరాబాద్ ఫిలింనగర్ లోని కల్చరల్ సెంటర్ లో టాలీవుడ్ కు చెందిన 24 విభాగాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్రసీమను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారు.

చిత్ర నిర్మాణ వ్యయం పెరగడం, క్యూబ్ డిజిటల్ ప్రసారాల చార్జీలు పెరగడం, థియేటర్లపై విద్యుత్ చార్జీల భారం, ఓటీటీలకు ఆదరణ లభిస్తుండడం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, నట్టి కుమార్, ప్రసన్నకుమార్, సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో అనేక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపామని, సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. మరో 3 నెలల తర్వాత కూడా ఇదే తరహాలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Tollywood
Meeting
24 Crafts
Corona Crisis
Film Nagar

More Telugu News