మధుర గాయని ఎస్.జానకి గుండెపోటుతో కన్నుమూత
- ప్రముఖ గాయని ఎస్. జానకి (88) మైసూరులో కన్నుమూత
- ఆరు దశాబ్దాల కెరీర్లో 48 వేలకు పైగా పాటలు పాడిన గానకోకిల
- 2013లో ప్రకటించిన పద్మభూషణ్ను సున్నితంగా తిరస్కరించిన వైనం
- కొద్ది నెలల క్రితమే ఏకైక కుమారుడిని కోల్పోయిన జానకి
- ఆమె మృతితో భారతీయ సంగీతంలో ఒక శకం ముగిసిందన్న ప్రముఖులు
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న ప్రముఖ గాయని, 'దక్షిణ భారత గాన కోకిల'గా ప్రఖ్యాతి గాంచిన ఎస్.జానకి (శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆమె, శనివారం, జూలై 11న కర్ణాటకలోని మైసూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆరు దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో కోట్లాది మంది సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన జానకమ్మ మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసినట్లయింది. ఆమె మనవరాలు అప్సర వైద్యుల ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
జానకికి గుండెపోటు రావడంతో ఈ మధ్యాహ్నం 12.49 గంటలకు అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ ద్వారా వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శిష్ట్లా శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. ఆమె తండ్రి ఆయుర్వేద వైద్యుడు, ఉపాధ్యాయుడు. బాల్యం ఎక్కువగా సిరిసిల్లలో గడిచింది. తొమ్మిదేళ్ల వయసులోనే తొలిసారి వేదికపై పాడి తనలోని గాన ప్రతిభను చాటుకున్నారు. మేనమామ సలహాతో మద్రాసు చేరిన ఆమె, ఏవీఎం స్టూడియోస్లో సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం వద్ద తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలైయాట్టు'తో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసిన జానకి, అదే ఏడాది తెలుగులో 'ఎమ్మెల్యే' చిత్రంలో పాడారు. తొలి సంవత్సరంలోనే ఏకంగా ఆరు భాషల్లో పాటలు పాడి అబ్బురపరిచారు.
ఆమె ఆరు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20 భారతీయ భాషల్లో, అలాగే ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ వంటి విదేశీ భాషల్లోనూ కలిపి 48,000కు పైగా పాటలను రికార్డ్ చేశారు. తన మాతృభాష తెలుగు అయినప్పటికీ, ఆమె అత్యధికంగా కన్నడంలో, ఆ తర్వాత మలయాళంలో పాటలు పాడారు. భావాన్ని బట్టి స్వరాన్ని మార్చడంలో ఆమెకు ఆమే సాటి. అందుకే ఆమెను 'క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్' అని పిలుస్తారు. పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజ్కుమార్లతో కలిసి ఆమె పాడిన యుగళగీతాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇళయరాజా, ఎం.ఎస్. విశ్వనాథన్, ఏ.ఆర్. రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన పని అజరామరం.
ఆమె గాత్రానికి 4 జాతీయ పురస్కారాలు, 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెను 'పద్మభూషణ్' పురస్కారానికి ఎంపిక చేయగా, తన సంగీత సేవలకు 'భారతరత్న' రావాలని భావిస్తూ ఆ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. 2017 అక్టోబర్ 28న మైసూరులో నిర్వహించిన కచేరీతో ఆమె తన గాన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు.
1959లో వి. రామ్ప్రసాద్ను వివాహం చేసుకున్న ఆమెకు ఒక కుమారుడు మురళీ కృష్ణ ఉన్నారు. భర్త రామ్ప్రసాద్ 1997లో గుండెపోటుతో మరణించారు. కాగా, ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ అనారోగ్యంతో కన్నుమూయడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. కుమారుడిని కోల్పోయిన కొద్ది నెలలకే జానకి కూడా భౌతికంగా దూరమవ్వడంతో సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.
జానకికి గుండెపోటు రావడంతో ఈ మధ్యాహ్నం 12.49 గంటలకు అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ ద్వారా వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న శిష్ట్లా శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. ఆమె తండ్రి ఆయుర్వేద వైద్యుడు, ఉపాధ్యాయుడు. బాల్యం ఎక్కువగా సిరిసిల్లలో గడిచింది. తొమ్మిదేళ్ల వయసులోనే తొలిసారి వేదికపై పాడి తనలోని గాన ప్రతిభను చాటుకున్నారు. మేనమామ సలహాతో మద్రాసు చేరిన ఆమె, ఏవీఎం స్టూడియోస్లో సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం వద్ద తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలైయాట్టు'తో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేసిన జానకి, అదే ఏడాది తెలుగులో 'ఎమ్మెల్యే' చిత్రంలో పాడారు. తొలి సంవత్సరంలోనే ఏకంగా ఆరు భాషల్లో పాటలు పాడి అబ్బురపరిచారు.
ఆమె ఆరు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20 భారతీయ భాషల్లో, అలాగే ఇంగ్లీష్, జపనీస్, జర్మన్ వంటి విదేశీ భాషల్లోనూ కలిపి 48,000కు పైగా పాటలను రికార్డ్ చేశారు. తన మాతృభాష తెలుగు అయినప్పటికీ, ఆమె అత్యధికంగా కన్నడంలో, ఆ తర్వాత మలయాళంలో పాటలు పాడారు. భావాన్ని బట్టి స్వరాన్ని మార్చడంలో ఆమెకు ఆమే సాటి. అందుకే ఆమెను 'క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మాడ్యులేషన్' అని పిలుస్తారు. పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజ్కుమార్లతో కలిసి ఆమె పాడిన యుగళగీతాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇళయరాజా, ఎం.ఎస్. విశ్వనాథన్, ఏ.ఆర్. రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె చేసిన పని అజరామరం.
ఆమె గాత్రానికి 4 జాతీయ పురస్కారాలు, 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెను 'పద్మభూషణ్' పురస్కారానికి ఎంపిక చేయగా, తన సంగీత సేవలకు 'భారతరత్న' రావాలని భావిస్తూ ఆ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. 2017 అక్టోబర్ 28న మైసూరులో నిర్వహించిన కచేరీతో ఆమె తన గాన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు.
1959లో వి. రామ్ప్రసాద్ను వివాహం చేసుకున్న ఆమెకు ఒక కుమారుడు మురళీ కృష్ణ ఉన్నారు. భర్త రామ్ప్రసాద్ 1997లో గుండెపోటుతో మరణించారు. కాగా, ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ అనారోగ్యంతో కన్నుమూయడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. కుమారుడిని కోల్పోయిన కొద్ది నెలలకే జానకి కూడా భౌతికంగా దూరమవ్వడంతో సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.