గుజరాత్లో కొండపై ఉన్న 11 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి చంపేసిన సింహం
- గిర్నార్ కొండపై బాలుడిపై సింహం దాడి
- యాత్రికుల కళ్లెదుటే చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లిన వైనం
- దాడి చేసిన సింహంతో పాటు మూడింటిని బంధించిన అధికారులు
- భక్తుల భద్రత దృష్ట్యా గిర్నార్ యాత్ర మార్గం మూసివేత
గుజరాత్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గిర్నార్ కొండపై పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వెళ్లిన 11 ఏళ్ల బాలుడిపై సింహం దాడి చేసి ప్రాణాలు తీసింది. శనివారం తెల్లవారుజామున వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు గిర్నార్ యాత్రను తక్షణమే నిలిపివేశారు.
ఖేడా జిల్లాకు చెందిన మయూర్ చౌహాన్ (11) తన కుటుంబ సభ్యులతో కలిసి గిర్నార్ కొండను ఎక్కుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం యాత్ర మార్గంలోని 50వ మెట్టు సమీపానికి చేరుకోగానే, పొదల్లో మాటు వేసిన సింహం ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. కుటుంబ సభ్యులు, తోటి యాత్రికులు భయంతో కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతానికి సుమారు 100 మీటర్ల దూరంలో బాలుడి శరీర భాగాలను గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో సంచరిస్తున్న మూడు సింహాలను అధికారులు బంధించి, సక్కర్బాగ్ జూకు తరలించారు. వాటిలో ఒక సింహం బాలుడి శరీర భాగాలను బయటికి కక్కడంతో, అదే దాడికి పాల్పడి ఉంటుందని అధికారులు ధృవీకరించారు.
భక్తుల భద్రత దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు గిర్నార్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇటీవల వన్యప్రాణుల దాడులు పెరుగుతుండటం పట్ల యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే భావ్నగర్ జిల్లాలో జరిగిన చిరుత దాడిలో మరో బాలుడు మరణించాడు.
ఖేడా జిల్లాకు చెందిన మయూర్ చౌహాన్ (11) తన కుటుంబ సభ్యులతో కలిసి గిర్నార్ కొండను ఎక్కుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం యాత్ర మార్గంలోని 50వ మెట్టు సమీపానికి చేరుకోగానే, పొదల్లో మాటు వేసిన సింహం ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. కుటుంబ సభ్యులు, తోటి యాత్రికులు భయంతో కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతానికి సుమారు 100 మీటర్ల దూరంలో బాలుడి శరీర భాగాలను గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో సంచరిస్తున్న మూడు సింహాలను అధికారులు బంధించి, సక్కర్బాగ్ జూకు తరలించారు. వాటిలో ఒక సింహం బాలుడి శరీర భాగాలను బయటికి కక్కడంతో, అదే దాడికి పాల్పడి ఉంటుందని అధికారులు ధృవీకరించారు.
భక్తుల భద్రత దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు గిర్నార్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇటీవల వన్యప్రాణుల దాడులు పెరుగుతుండటం పట్ల యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే భావ్నగర్ జిల్లాలో జరిగిన చిరుత దాడిలో మరో బాలుడు మరణించాడు.