Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు 'కర్ణాటక రత్న' పురస్కారం ప్రకటించిన ప్రభుత్వం

  • ఇటీవల మరణించిన పునీత్ 
  • గుండెపోటుతో కన్నుమూత
  • ఇప్పటికీ విషాదంలో కుటుంబ సభ్యులు, అభిమానులు
  • మరణానంతర అవార్డుపై ట్వీట్ చేసిన సీఎం బొమ్మై
Karnataka govt announced Karnataka Ratna for late Puneeth Rajkumar

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పునీత్ కు ప్రతిష్ఠాత్మక 'కర్ణాటక రత్న' పురస్కారం ప్రకటిస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ గత నెలలో హఠాన్మరణం చెందడం తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదానికి గురిచేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

More Telugu News