MAA: అరగంట ముందే ప్రారంభమైన 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • 'మా' ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ
  • ఈసారి భారీగా ఓటింగ్
  • కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు
  • ప్యానెల్ సభ్యులకు మాత్రమే అనుమతి
MAA elections counting starts

అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అరగంట ముందే ఓట్ల లెక్కింపు షురూ చేశారు. గత మా ఎన్నికలకు భిన్నంగా ఈసారి అత్యధిక సంఖ్యలో ఓట్లు పోలవడంతో  ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ప్యానెల్ సభ్యులకు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు అనుమతిస్తున్నారు.

సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో మంచు విష్ణుదే విజయం అని స్పష్టం చేశారు. విష్ణు 80 నుంచి 100 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని పేర్కొన్నారు. 'మా' ఎన్నికల్లో ఈసారి సైలెంట్ ఓటింగ్ జరిగిందని అన్నారు. భారీ ఓటింగ్ తో విష్ణు ప్యానెల్ కే అనుకూలమని నరేశ్ అభిప్రాయపడ్డారు. విష్ణు ప్యానెల్ కోసం వ్యూహాత్మకంగా పనిచేశామని, విష్ణు కోసం దూరప్రాంతాల నుంచి ఓటేయడానికి వచ్చారని వివరించారు.

More Telugu News