Evaru Meelo Koteeswarulu: 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభ ఎపిసోడ్ కు రామ్ చరణ్... ఎన్టీఆర్ వెల్లడి

  • ఈ నెల 22 నుంచి 'ఎవరు మీలో కోటీశ్వరులు'
  • జెమినీ టీవీలో ప్రసారం
  • ఓపెనింగ్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిందన్న ఎన్టీఆర్
  • కావాల్సినంత వినోదం లభిస్తుందని వెల్లడి
NTR shares promo of Evaru Meelo Koteeswarulu featuring  Ram Charan

తెలుగు తెరపై అతిపెద్ద గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. జెమినీ టీవీలో ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ (కర్టెన్ రైజర్)కు ముఖ్య అతిథి తన సోదరుడు రామ్ చరణ్ అని ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమోను పంచుకున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ జరిగిందని, ప్రేక్షకులకు ఎంతో వినోదం లభిస్తుందని వివరించారు.

More Telugu News