Chiranjeevi: 'లూసిఫర్' రీమేక్ నుంచి డైరెక్టర్ తప్పుకున్నాడా?

  • మలయాళంలో హిట్ మూవీ
  • చిరూ ఆసక్తిని చూపిన కథ
  • దర్శకుడిగా మోహన్ రాజా ఎంపిక
  • తప్పుకున్నట్టుగా వార్తలు
  • వినాయక్ కి దక్కే ఛాన్స్ ఎక్కువ  
Mohan Raja is not doing Lucifer remake

చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. ఇంకా ఓ పది పదిహేను రోజుల షూటింగ్ ఉందనగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. వచ్చేనెలలో ఆ కాస్త షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇది రొటీన్ కి భిన్నమైన సినిమాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అందువలన ఆ సినిమా రీమేక్ లో చేయాలని చిరూ భావించారు.

ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తమిళ దర్శకుడు .. ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజాకి ఇచ్చారు. కొంతకాలంగా తెలుగు నేటివిటీకి తగిన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అయితే వాటి విషయంలో చిరంజీవి అసంతృప్తిగానే ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి మోహన్ రాజా తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణమేమిటనేది మాత్రం తెలియదు. మోహన్ రాజా తప్పుకోవడం నిజమే అయితే, ఈ ప్రాజెక్టు వినాయక్ చేతికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.  

More Telugu News