Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఎక్కడైనా ఒకటే అంటున్న రష్మిక 
  • మరో ప్రాజక్టుకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్
  • కశ్మీర్లో దుల్ఖర్ త్రిభాషా చిత్రం షూటింగ్  
Rashmika shares her experience in different languages

*  'తెలుగు ఇండస్ట్రీ అయినా.. బాలీవుడ్ అయినా.. కన్నడ ఇండస్ట్రీ అయినా.. చిత్రపరిశ్రమ అన్నాక ఏదైనా ఒకటే' అంటోంది కథానాయిక రష్మిక. ప్రస్తుతం ఈ చిన్నది దక్షిణాది సినిమాలతో పాటు రెండు హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. ఆ అనుభవం వివరిస్తూ.. "పరిశ్రమ ఏదైనా ఒకటే.. ఆయా వ్యక్తులే భిన్నంగా పనిచేస్తుంటారు. తప్పితే సినిమా వాతావరణం మాత్రం అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. నాకు పెద్దగా మార్పు కనపడలేదు" అని చెప్పింది రష్మిక.
*  ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చిత్రాన్ని చేస్తున్న నందమూరి బాలకృష్ణ దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తారని తెలుస్తోంది. తాజాగా అనిల్ చెప్పిన కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
*  మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ కథానాయకుడుగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న త్రిభాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతోంది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ షూటింగులో మిలటరీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటించే అవకాశం వుంది.

More Telugu News